నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యర్థి వర్గాల ఘర్షణ.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది!

  • ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
  • ఈరోజు గోస్పాడులో కొట్టుకున్న రెండు వర్గాలు
  • గాయాలతో ఆసుపత్రికి వచ్చాక మళ్లీ ఘర్షణ
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు రెండు గ్రూపులు కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసుకున్నాయి. ఈ సందర్భంగా తీవ్రగాయాలతో ఆసుపత్రికి చేరుకున్న ఇరువర్గాలు కసితీరక మరోసారి కొట్టుకున్నాయి. ఈ ఘటన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోస్పాడుకు చెందిన రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు గ్రూపులు ఈరోజు కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడిచేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో వీరిని బంధువులు, కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో తమ ప్రత్యర్థులను చూడగానే ఇరువర్గాలు మళ్లీ రెచ్చిపోయాయి. ఏది కనబడితే దాన్ని తీసుకుని దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆసుపత్రిలోని డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం కాగా, వైద్య సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులకు చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Kurnool District
Two groups
Fight
Police

More Telugu News